బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరిని కదిపినా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల ప్రేమ వ్యవహారమే వినపడుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీతో ఎఫైర్ పెట్టుకోవటానికి బిటౌన్ హీరోయిన్స్ ఇప్పటికీ రెడీగా ఉంటే, ఆ ఛాన్స్ ని అనుష్క శర్మ మాత్రమే దక్కించుకుంది. దీంతో బిటౌన్ హీరోయిన్స్ కి అనుష్క శర్మ అంటే పీకల్లోతు కోపం. అలాగే అనుష్క శర్మతో డేటింగ్ వ్యవహారం నడుపుదామనుకుంటున్న బిటౌన్ టాప్ హీరోలకు ఆ ఛాన్స్ విరాట్ కోహ్లీకి మాత్రమే వెళ్ళినందుకు, వీరి బ్రేక్ అప్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు వీరంతా. ఇదిలా ఉంటే తాజాగా కోహ్లీ, అనుష్క ల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వచ్చినట్టు అందరూ పసిగట్టేశారు.

ఇక వీరిద్దరూ విడిపోవటానికి పెద్ద సమయం పట్టదంటూ, బిటౌన్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. రాత్రివేళ్లలో రెస్టారెంట్లకు వెళ్లడం, ఎవరికీ తెలియకుండా వీరిద్దరు షికార్లు చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కేవలం దేశంలోనే కాదు.. విదేశాల్లో కోహ్లీ పర్యటించిన సమయంలో అనుష్క అక్కడికి వాలిపోయేది. ఆమధ్య ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీతోపాటు అనుష్క కూడా ఇంగ్లాండ్ కి వెళ్లడం పెద్ద దుమారాన్నే రేపింది. అప్పుడు ఈ జంటపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువడ్డాయి.

ఆమధ్య కోహ్లీ సెంచరీ కొట్టగానే ఆ మైదానంలో వున్న తన ప్రేమసి అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చేశాడు. ఇటీవల ఐపీఎల్ లో ఒక మ్యాచ్ సందర్భంగా అనుష్క నేరుగా కోహ్లీ దగ్గరకు వచ్చి అతనితో ముచ్చటించడం తీవ్ర దుమారాన్నే రేపింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ మాత్రమే సీక్రెట్ గా ఉన్న ఫోటోలు కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

ఆ ఫోటోలు అనుష్క శర్మ ఫోన్ నుండి బయటకు వచ్చినట్టు కోహ్లి అనుమానిస్తున్నాడంటూ. అనుష్క మాత్రం విరాట్ చేయకపోతే, ఆ ఫోటోలు ఎలా బయటకు వస్తాయి అంటూ సన్నిహితుల వద్ద చెప్పుకొస్తుంది. మొత్తంగా ఈ ఫోటోలు వ్యవహారంతో వీరిద్దరి మధ్య పీకల్లోపు మనస్ఫర్ధలు వచ్చాయి. త్వరలోనే బ్రేక్ అప్ విషయమై వీరిద్దరూ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: