వంద సంవత్సరాల క్రితం భారత దేశ ప్రజల ముందుకు సినిమా అడుగు పెట్టింది. ఇప్పుడు చలన చిత్ర రంగం ఎంతో టెక్నాలజీతో ముందుకు వెళ్తుంది. గ్రాఫిక్ , యానిమేషన్ మాయాజాలంతో అద్భుత సృష్టితో సినిమా రంగం వెలిగిపోతుంది. ఇక భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర రంగానికి చెందిన అగ్ర తారలు అందరూ కలిసి ఒక వేధికపై కలుస్తారు. ఎయిటీస్ రీ యూనియన్ లో భాగంగా సినీతారలు ఒకో చోట కలిసి సందడి చేస్తారు.

గత ఆరు సంవత్సరాలుగా 1980లలో వెండితెరను ఏలిన నటీ నటులు కలుసుకుంటూ తమ తమ మధుర స్మృతులను పంచుకుంటున్నారు.ఇక ఈ సంవత్సరం కూడా ఎయిటీస్ నటులంతా చెన్నై ఆలివ్ బీచ్ లోని నీనా రెడ్డి గెస్ట్ హౌస్ లో దాదాపు 35 మంది సీనియర్ నటీనటుల కలుసుకొని ఆట పాటలు, కామెడీ స్కిట్స్ లాంటి వినోదభరిత కార్యక్రమాలతో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ సారి ప్రోగ్రామ్ లో బాలకృష్ణ,నాగార్జున పాల్గొనలేక పోయారు.

 ఎయిటీస్ రీ యూనియన్ 2014 మోహన్ లాల్,రాధ,రజినీకాంత్,చిరంజీవి,రాధిక,భానుచందర్


ఇక ఈ ఇవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సుమన్, సీనియర్ నరేష్, మోహన్ లాల్, బాను చందర్, జయ సుధ, సుహాసిని, రాధిక, రమ్యకృష్ణ, సుమలత, రాధ తదితర స్టార్ లు పాల్గొని తోటి నటీనటులతో హాయిగా కాలక్షేపం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: