కాస్త క్రేజ్ వచ్చిన బాలీవుడ్ సినిమాలు సౌత్ లోకి, ఇక్కడ సూపర్ హిట్ సినిమాలు బాలీవుడ్ లోకి వెళ్లడం మామూలైపోయింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రదర్స్ సినిమా మాత్రం రిలీజ్ కు ముందే టాలీవుడ్లో, కోలీవుడ్లో బ్రదర్స్ గా ఎవరెవరైతే బాగుంటారోనని తెగ హడావిడి చేసేశారు. తీరా ఆగష్టు 14న అయిన హింది బ్రదర్స్ తుస్సుమనిపించేసరికి ఇప్పుడు ఎవరికి వారు మేము చేయమంటే మేము చేయమని చేతులు ఎత్తేస్తున్నారు.

 

టాలీవుడ్లో రామ్ చరణ్ రానాలు, కోలీవుడ్లో సూర్య బ్రదర్స్ ఈ సినిమాను చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రిలీజైన అసలు సినిమానే ప్రేక్షకులను అలరించలేకపోయింది కాబట్టి ఇప్పుడు వీరు కూడా ఆ సినిమా చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదట. కరణ్ జోహార్ ఒప్పించే ప్రయత్నం చేసిన రామ్ చరణ్ సారీ వేరే కథ ఉంటే చెప్పండి.. అది అయితే వద్దు అన్నాడట. ఇక సూర్య కూడా ఆల్రెడీ రిజల్ట్ చూశాక ఎలా చేస్తామండి అని అంటున్నాడట.

 

బ్రదర్స్ సినిమాలో అక్షయ్ కుమార్ :  

 

ఒకవేళ హిట్ అయితే పోటి పడి మరి చేసేవారేమో గాని అక్కడే అట్టర్ ఫ్లాప్ అయిన బ్రదర్స్ సినిమాను ఇక ఇక్కడ ఎలా రీమేక్ చేస్తారు మనవాళ్లు. అక్షయ్ కుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రదర్స్ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కాని కలెక్షన్లు మాత్రం 80 కోట్లు కూడా దాటలేదని అంటున్నారు. మరి అక్కడే అలాంటి డిజాస్టర్ గా మిగిలిన సినిమాను ఇక్కడ హీరోలు తెగించి ఎలా చేయగలరు చెప్పండి.

 

హాలీవుడ్ సినిమా ‘వారియర్స్’ సినిమాకు అఫిషియల్ రీమేక్ అయిన బ్రదర్స్ ఫ్లాప్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. హాలీవుడ్ వారియర్స్ చాలా పెద్ద హిట్ అయింది మరి బ్రదర్స్ ఎందుకో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ఇక్కడ ఆ సినిమా ద్వారా మరోసారి మల్టిస్టారర్ సినిమా చూద్దామనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: