నిన్నటి రోజున ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన కెరియర్ గురించి తన పై ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ గురించి వివరణ ఇచ్చింది. తన పై మీడియా తరుచూ వ్రాసే రూమర్స్ చదివినప్పుడు స్టుపిడ్ గా అనిపిస్తుందని అంటూ కామెంట్ చేసింది అనుష్క. తన పై రూమర్స్ వ్రాస్తున్న వారి పై కోపం రాడు సరికదా వారి పై తనకు జాలి కలుగుతుందని అంటూ తన దృష్టిలో ఆ వార్తలు వ్రాసే వారిపై ఎటువంటి విలువ లేదని అలాంటి వార్తలు వ్రాసే వారు తమకు తామే విలువ పోగొట్టుకుంటున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనుష్క.

ఇప్పటికే తనకు మీడియా 5 సార్లు పెళ్ళి చేసిందని భవిష్యత్ లో ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుందో తనకు తెలియదు అని మీడియా పై సెటైర్లు వేసింది జేజెమ్మ. తాను ‘బలాదూర్’ సినిమా చేస్తున్నప్పుడు తనతో నటిస్తున్న ఒక డూప్ నీటిలో పడి చనిపోతే తాను సరదాగా ఆ వ్యక్తిని నీటిలో తోసేయడంతో చనిపోయాడు అంటూ మీడియా కొన్ని ఛానల్స్ వార్తలను సృష్టిస్తే కొన్నాళ్ళ పాటు ఛానల్స్ కూడ చూడలేదు అని మీడియా పై తన కోపాన్ని చూపించింది దేవసేన. 

ఇక తన పెళ్ళి ఎప్పుడూ అన్న విషయమై మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ మ్యాజికల్ గా జరిగిన నేపధ్యంలో తన పెళ్ళి కూడ టైమ్ వచ్చినప్పుడు జరిగి పోతుందని దీన్ని గురించి తన కంటే ఎక్కువగా మీడియా ఎందుకు ఆలోచిస్తోందో తనకు అర్ధం కావడం లేదని కామెంట్స్ చేసింది స్వీటి. 

ఇక తనకు కెరియర్ బ్రేక్ ఇచ్చిన ‘అరుంధతి’ సినిమాలోని జేజెమ్మ పాత్ర గురించి మాట్లాడుతూ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈసినిమాను నిర్మించే సమయంలో ఆర్ధిక సమస్యలతో ఉండటం వల్ల అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్ ని తీసుకుకుండా పారితోషికం తక్కువ అని తనను ఎంపిక చేసారో లేకపోతే ఆ స్క్రిప్ట్ కు తాను సరిపోతానని ఎంపిక చేసారో తనకు క్లారిటీ లేకపోయినా తనకు యాక్టింగ్ రాదు అని చాలామంది శ్యామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర కామెంట్ చేసినా పట్టించు కోకుండా తనను జేజెమ్మ పాత్రకు ఎంపిక చేయకపోతే తన కెరియర్ ఈ ఉన్నత స్థానంలో ఉండేది కాదని అంటూ అదే తన అదృష్టం అని తన పై తానే కామెంట్ చేసుకుంది అనుష్క..



మరింత సమాచారం తెలుసుకోండి: