కాంచనమాల కేబుల్ టివితో హీరోయిన్ గా పరిచయమైన హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఇంకా సినిమాల కోసం ఎప్పటిలానే నిరీక్షిస్తుంది. దశాబ్దం కిందట హీరోయిన్ గా అరంగేట్రం చేసినా అమ్మడు ఏమాత్రం స్టార్ డంని తెచ్చుకోలేకపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించట్లేదని చిన్నగా కోలీవుడ్ కి చెక్కేసిన అమ్మడు అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కాని అక్కడ కూడా పెద్దగా ఫలితం లేకపోయే సరికి ఏవో చిన్నా చితకా పాత్రలతో అడ్జెస్ట్ అయిపోతుంది.

 

మొన్నామధ్య ధోనితో ఎఫైర్ అని వచ్చిన వార్తల పుణ్యమా అని అమ్మడికి ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చింది ఆ దారిలోనే సినిమా అవకాశాలు కూడా పట్టేసింది. అయినా మళ్లీ కథ మొదటికే వచ్చింది. అయితే ప్రస్తుతం ఒక హార్రర్ సినిమా చేస్తుందట లక్ష్మిరాయ్. సుందర్ దర్శకత్వంలో అరణ్మయి సినిమా చేసిన లక్ష్మి రాయ్ అప్పట్లో ఆ సినిమా చేసేప్పుడే తనకి అర్ధరాత్రి కలలో దెయ్యం కలలు వస్తున్నాయని నానా హడావిడి చేసింది. అయితే మొదటి సారి కాబట్టి అమ్మడు ఈ విధంగా సినిమా పబ్లిసిటీ కోసం మాట్లాడుతుంది అనుకున్నారు.

 

'అరణ్మయి' సినిమాలో లక్ష్మీరాయ్ :

 

అయితే ప్రస్తుతం లక్ష్మిరాయ్ చేస్తుంది కూడా ఒక హర్రర్ సినిమా అట. ‘షౌకార్ పెట్టై’ అనే హర్రర్ సినిమాలో నటిస్తున్న లక్ష్మిరాయ్ షూటింగ్ కోసం అమ్మడికి ఓ హోటెల్లో రూంని బుక్ చేశారట. అయితే ఒకరోజు షూటింగ్ చేసి వచ్చి నైట్ పడుకున్న టైంలో సడెన్ గా మెలకువ వచ్చి విండో వైపు చూస్తే ఏదో ఫ్లాష్ వెలుతురు వచ్చినట్టుగా గమనించిందట. అంతేకాదు దానితో పాటుగా ఓ వింత శబ్ధం కూడా వినిపించిందట. హోటెల్ సిబ్బందికి చెబితే వారు దాన్ని చాలా తేలికగా తీసిపారేశారట.

 

కాని అమ్మడికి మళ్లీ మళ్లీ అలా ఫ్లాష్ ఇంకా సౌండ్లు వినిపించాయని చెబుతుంది. అయితే ఇక నిద్ర పట్టని ఆమె నైట్ అంతా దేవుడి శ్లోకాలు చదువుకుంటూ కూర్చుందట. అయితే ఇదంతా ఒకపత్రిక కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ చిన్నది. అయితే ఆమె మాట్లలు విన్న వారు మాత్రం కచ్చితంగా లక్ష్మిరాయ్ ఈసారి కూడా సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందని అంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: