ప్రిన్స్ మహేష్బాబు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో ఉన్న ఊరును దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. అలాగే మహేష్-శృతి మధ్య ఫస్టాఫ్లో కెమిస్ర్టీ కూడా యూత్ను రిపీటెడ్గా థియేటర్లకు రప్పిస్తోంది.
ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ను రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిలకడగా కలెక్షన్స్ ని రాబట్టుగలుగుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయ్యే సమయానికి, అన్ని కలెక్షన్స్ కలుపుకొని దాదాపు 150 కోట్ల రూపాయల గ్రాస్ ని టచ్ అవుతుందని అంటున్నారు.
ఇందులో శాటిలైట్ రైట్స్, ఆన్ లైన్ రైట్స్ కూడ ఉన్నాడు. మహేష్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం అనేది నిజంగా థ్రిల్లింగ్ గానే అనిపిస్తుంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది ప్రిన్స్ అభిమానులకి మంచి జోష్ ని ఇచ్చింది.
అంతే కాకుండా మహేష్ బాబు సైతం తన స్టార్ట్ చేసిన బ్యానర్ లో మొదటి మూవీనే గ్రాండ్ సక్సెస్ కావడంతో, ఈ తరహా క్యాలీటీ కథలను మరిన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. మొత్తంగా శ్రీమంతుడు మూవీ కలెక్షన్స్ పెరగటానికి కారణం, తాజాగా వచ్చిన కిక్2 మూవీ సైతం ప్రేక్షకులకి అంత కిక్కు ఇవ్వకపోవటమే. దీంతో రిపీటెడ్ ఆడియోన్స్ ని శ్రీమంతుడు మూవీ పొందగలుగుతుంది.