తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి..అక్కినేని నాగార్జున అంటే మంచి పేరు ఉన్న హీరోలు.. వీరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు..ఆ మద్య నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రామ్ లో వీరి మద్య ఉన్న స్నేహబంధం గురించి బాగా తెలిసింది. ఏ ఈవెంట్ అయినా చిరంజీవి,నాగార్జునలు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అయితే ఇప్పుడు మాత్రం నాగార్జున మాత్రం మెగాస్టార్ అన్నా..రాంచరణ్ అన్నా చిర్రుబొర్రులాడుతున్నాడు.

వివివినాయక్ దర్శకత్వంలో నాగార్జున,అమల ముద్దుల తనయుడు అఖిల్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా సాగుతుంది. సినిమా పేరు ‘అఖిల్’ ఈ సినిమా టీజర్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇక చిరు తనయుడు రాంచరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బ్రూస్ లీ’ చిత్రం చిరంజీవి పుట్టినరోజు కానుకగా టీజర విడుదల చేశారు. ఇక ఇక్కడే సమస్య మొదలైంది.. ఇద్దరి సినిమాలు షరవేగంగా జరుపుకోవడంతో.. సినిమా విడుదల కూడా అక్టోబర్ లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.

బ్రూస్ లీ లో రాంచరణ్, అఖిల్ చిత్రంలో అఖిల్


ఈ నేపథ్యంలో బ్రూస్లీ మేకర్స్ అక్టోబర్ 15న చెర్రీ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.   అఖిల్ మూవీ కూడా అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల చెర్రీ రిలీజ్ డేట్ మార్చాడు.. బ్రూస్లీని అక్టోబర్ 21వ తేదీకే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేశాడట. దీంతో అక్కినేని నాగార్జున చెర్రీ అంటేనే మండిపడుతున్నారు.అందుకే నాగార్జున మెగాస్టార్, రామ్ చరణ్ అంటే కోప్పడుతున్నారని.. అఖిల్ ఫస్ట్ మూవీ సినిమా రిలీజ్‌కు ఫిక్స్ చేసిన రోజునే చెర్రీ కూడా తన సినిమాను విడుదల చేసేందుకు రెడీ కావడం ఎందుకని నాగ్ ఫైర్ అవుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: