క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ క్రేజీ బ్యూటీ ఛార్మీకి సన్నిహితుడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఆమధ్య మీడియా కూడ వీరిద్దరిని లింక్ చేస్తూ రకరకాల గాసిప్పులు వ్రాసింది. ఆ తరువాత ఆ వార్తలను వీరిద్దరూ ఖండించారు. ఈ విషయం జరిగి చాల రోజులు అయిన తరువాత ఛార్మీ గతవారం దేవిశ్రీప్రసాద్ కు అనుకోని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం ఫిలింనగర్ లో మటుకు ఈ న్యూస్ హాట్ టాపిక్.

ఇక వివరాలలోకి వెళితే ఫిలింనగర్ లో వినపడుతున్న గాసిప్పుల ప్రకారం గత శనివారం రాఖీ పండుగ రోజున ఛార్మీ దేవిశ్రీప్రసాద్ సోదరుడు గాయకుడు సాగర్ కు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నదట. అయితే ఇప్పుడు ఈ న్యూస్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సొంత సోదరులకు సోదరుడిగా భావించే వ్యక్తులకు సామాన్యంగా రాఖీలు కడుతూ ఉంటారు.

మరి ఛార్మీ సాగర్ కు సోదరుడిగా భావించి రాఖీ కట్టింది కాబట్టి దేవిశ్రీప్రసాద్ కూడ సోదరుడిగానే ఛార్మీకి మారిపోతాడు కదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈ సెటైర్లు వేస్తున్న వారు మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. 

అతిలోకసుందరి శ్రీదేవి బాలీవుడ్ క్వీన్ గా రాజ్యం ఏలుతున్న రోజులలో ప్రతిరాఖీ పండుగకు శ్రీదేవి తాను సన్నిహితంగా ఉండే బోనీ కపూర్ కు ఇలాగే రాఖీలు కట్టేదట. అయితే శ్రీదేవి తల్లి చనిపోయిన తరువాత మారిపోయిన పరిస్థుతులలో అదే బోని కపూర్ శ్రీదేవికి భర్తగా మారిపోయాడు. ఇప్పుడు కూడ ఇటువంటి ట్విస్టులు ఛార్మీ విషయంలో ఉంటాయా  అంటూ కొందరు గాసిప్పుల రాయుళ్ళు ఫిలింనగర్ లో సెటైర్లు వేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: