ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ 25 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లు వసూలు చేసిందని ఈసినిమా నిర్మాతలు అధికారికంగా చెప్పడంతో మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో హీరోయిన్ శ్రుతిహాసన్ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నాయి. 

‘శ్రీమంతుడు’ ప్రభావంతో చాలామంది సెలెబ్రెటీలు వ్యాపారవేత్తలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో శ్రుతి మహేష్ ను అనుసరిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నా ఆనిర్ణయం మహేష్ వల్ల తీసుకున్నది కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

ఇక వివరాలలోకి వెళితే శ్రుతిహాసన్ కూడ తమిళనాడులోని ఒక మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని దానిని అభివృద్ది చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇలా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన తనకు ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన తరువాత రాలేదని తనకు ఈ ఆలోచన నాలుగు సంవత్సరాల క్రితమే వచ్చిందని చెపుతోంది శ్రుతి.

తన తండ్రి కమలహాసన్ సూచనతో తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఒక సినిమాలో ఒక పాత్ర పోషించినంత మాత్రాన ఆ పాత్ర ప్రభావంతో తాను నిర్ణయాలు తీసుకోను అంటూ కామెంట్స్ చేసింది శ్రుతి. దీనిని బట్టి చూస్తూ ఉంటే శ్రుతికి ఎంత ఆత్మాభిమానం ఉందో అర్ధం అవుతుంది. ఏమైనా శ్రుతిహాసన్ కామెంట్స్ మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: