ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. తను నటించిన కంచె మూవీ చాలా డిఫ్రెంట్ గా ఉందని అందరూ అంటున్నారు. ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన రెండవ సినిమా‘కంచె’ తనని స్టార్ డం స్థాయికి తీసుకుపోతుందని భావిస్తున్నాడు. 

ఇదిలా ఉండగానే అప్పుడే తన మూడవ సినిమా సినిమా ‘లోఫర్’ షూటింగ్ ని చివరి దశకు తీసుకువచ్చేసాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా గత కొద్ది రోజులుగా రాజస్థాన్ లోని జైసల్మీర్,జోధ్పూర్ లలో ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని షూట్ చేసారు. రాజస్థాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం గోవా చేరుకోనుంది. 

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా లోఫర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. లోఫర్ కథ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడంట పూరీ. అయితే అయితే కథ బాగుంది, కాని పూర్తి స్థాయిలో జూనియర్ కి నచ్చలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మరో కథని రెడీ చేసుకొని టెంపర్ పేరుతో దానితో తెరకెక్కించారు.

అయితే గతంలో జూనియర్ రిజెక్ట్ చేసిన కథలోని కొన్ని సీన్స్ ని టెంపర్ లో వాడగా, మిగతా సీన్స్ ని లోఫర్ లో పూరీ జగన్నాధ్ వాడుతున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే, లోఫర్ మాత్రం పూర్తి డిఫ్రెంట్. పూరీ స్టైల్ కాకుండా, కొద్దిగా వైరైటీ షేడ్స్ ఇందులో కనిపిస్తాయని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం.ఇప్పటికే 60%కి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సెప్టెంబర్ చివరిలోపు ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేయనున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: