ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి కనిపిస్తున్న విలక్షణ నటుడు. ఎందుకంటే, విలక్షణ దర్శకుడు క్రిష్, మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పరిచయమైన హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా‘కంచె’. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రానటువంటి ఓ సరికొత్త కథాంశం, నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ అప్పట్నుంచే విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యానికి ఒక ప్రేమకథను లింక్ చేస్తూ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. ఈ తరహా కథలను స్వతహాగా ఇష్టపడే వరుణ్ తేజ్, మరో చారిత్రక నేపథ్యం ఉన్న స్టోరికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన వివరాలను లోఫర్ రిలీజ్ తరువాత మాత్రం బయటకు అనౌన్స్ చేయాలని వరుణ్ నిర్ణయంగా తెలుస్తుంది.

మరో రెండు కమర్షియల్ మూవీలు రిలీజ్ అనంతరం తను ఆ చారిత్రక నేపథ్యం ఉన్న సాహసగాథ స్టోరి వివరాలను తెలియజేయనున్నాడు. ఇదిలా ఉంటే,ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా,తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు సినిమాకు ఓ సరికొత్త గుర్తింపు తెచ్చే సినిమాగా ‘కంచె’ నిలుస్తుందనే అభిప్రాయాలు సైతం ఇప్పట్నుంచే వ్యక్తమవుతున్నాయి.

రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి,అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సెప్టెంబర్ 12న కంచె ఆడియో విడుదల కానుండగా,అక్టోబర్ 2న గాంధీ జయంతికి సినిమా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: