ఒకప్పుడు శింబు-నయనతారది ఎంతటి ఘాటు ప్రేమో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ నెట్ లో కనిపించే లిప్ లాక్ ఫొటోలే వీరిద్దరి ఘాటు ప్రేమకు నిదర్శనం. అంతలా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ.. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో విడిపోయారు.ప్రస్తుతం పాత విషయాలు మరచిపోయి కెరీర్ లో బిజీ అయిన వీరిద్దరూ… మళ్లీ ఇప్పుడు కలసి ఓ సినిమాలో నటిస్తున్నారు. మాజీ లవర్ ను అప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాడట శింబు.  


గత కొంత కాలంగా శింబు సినిమా కష్టాలు మొదలయ్యాయి ఈ తరుణంలో ‘వాలు’ తో మూడేళ్ల త‌ర్వాత స‌క్సెస్ కొట్ట‌డంతో.. ఇక క‌ష్టాల‌న్నీ తీరిపోయిన‌ట్లే అని అంతా అనుకున్నారు. కానీ క‌ష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయ‌ని తెలుసుకోడానికి ఎంతో టైమ్ ప‌ట్ట‌లేదు. ఇప్పుడు శింబు మళ్లీ కష్టాల్లో పడ్డాడు అది కూడా తన మాజీ ప్రేయసితో.. ఇదున‌మ్మఆలుని పాండిరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శింబుకి జోడీగా న‌య‌న‌తార న‌టిస్తుంది. ఎప్పుడో మొద‌లైన ఈ సినిమా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో వాయిదాలు ప‌డుతూనే ఉంది. తాజాగా షూటింగ్ లో పాల్గొనాలంటూ న‌య‌న‌తారని కోరాడు శింబు. అయితే గత కొంత కాలంగా నయన తార సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.


నయన తార , శింబు


ఈ అమ్మడు తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు శింబో సినిమా ఇదున‌మ్మఆలు షూటింగ్ లో పాల్గొనడానికి నయన్ కి బిజీ షెడ్యూల్ అడ్డు వస్తుంది దీంతో ఈ శింబు సినిమాను ప‌క్క‌న‌బెట్టేసింది. ఇక వెయిట్ చేయలేక శింబు న‌య‌న‌పై శింబు కేస్ పెట్టాడు. న‌య‌న‌తార మాత్రం తాను ఇచ్చిన డేట్స్ ని శింబు అండ్ యూనిట్ వాడుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. త‌న‌కు రావాల్సిన పారితోషికంలో ఇంకా 50ల‌క్ష‌లు రాలేద‌ని మండిప‌డుతుంది. త‌న‌కు రెమ్యున‌రేష‌న్ రాక‌పోయినా ప‌ర్లేదు గానీ ఇత‌ర సినిమాల‌ను వ‌దిలేసి ఇప్పుడు శింబు సినిమా చేయ‌లేన‌ని తెగేసి చెప్పింది న‌య‌న‌తార‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: