పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సునామి లెక్క అని అంటారు అందరూ. ఎందుకంటే వపన్ కళ్యాణ్ దగ్గర్ ఓ ప్రత్యేకమైన పవర్ ఉంది. ఆ పవర్ ఎటువైపు వీస్తే, అక్కడ సునామీ క్రియేట్ అవ్వటం ఖాయం. అందుకే పవన్ కళ్యాణ్ తో ఎవరైనా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత, పవన్ సపోర్ట్ తో వచ్చిన అధికారపార్టీ సైతం సైతం, పవన్ కళ్యాణ్ తో చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా పని ముగించుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యణ్ ఎంచుకున్న దారిలో 24 గంటలు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరు పవన్ కళ్యాణ్ కి ఓ విషయాన్ని మాత్రం సూటిగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజల వద్ద కమిట్మెంట్ తో కూడిన స్టేట్మెంట్ ఇస్తారో, వాటిని ఆలస్యం జరగకుండా సాధ్యమైంత త్వరగా ఆచరణ రూపంలో పెట్టాలని కోరారు. ఎందుకంటే ఒక ఉధ్ధేశంతో ముందుకు రావటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఏదొక పనిలో నిమగ్నమైతే కానీ సంత్రుప్తి ఉండదు.

పవన్ కళ్యాణ్ చెప్పిన స్టేట్మెంట్ కి కొద్ది నెలల తరువాత పనులు ఆచరించాలి అనుకుంటే, అది ప్రజల ద్రుష్టిలో వీరు చులకనగా మారిపోతున్నారనే భావన కలుగుతుందట. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రజలకు పలు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ అనంతరం రాజకీయాలలో వేగవంతంగా పనిచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ వెంటే ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ని పవన్ వద్దకు తీసుకువెళ్ళారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో వేగవంతమైన చర్యలు తీసుకోలేకపోతే ఫ్యాన్స్ లోని ఓ వర్గం మాత్రం తనతో రాజకీయపరమైన సంబంధాల నుండి తొలగిపోతామని చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: