తెలుగు ఇండస్ట్రీలో ‘బాహుబలి’ లాంటి అద్భుతమైన సినిమా తీసి ప్రపంచ సినీ చరిత్రలో తెలుగోడి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాడు. ఈ సినిమాతో తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులు నెలకొల్పాడు. సుమారు రూ. 600 కోట్ల కలెక్షన్ల దిశగా సినిమా ఇప్పటికీ దూసుకెళ్తుంది. ఇప్పుడు రాజమౌళిని షాక్ గురిచేసిందట ఓ సినిమా ట్రైలర్.. మెగాస్టార్ తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ అనే చిత్రాన్ని చేశాడు అది రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే కంచె పోస్టర్లకు.. ఆగస్టు 15న విడుదలైన టీజర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక దశలో పవన్ కళ్యాన్ టీజర్ చూసి ఆశ్చర్య పోయి వీడు మా వరుణ్ తేజా అని అన్నాడట.. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. దర్శకుడు రాజమౌళి ‘కంచె’ ట్రైలర్ లో ఓ సీన్ చూసి షాక్ అయ్యాడట.  ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలియజేశాడు.

కంచె మూవీ పోస్టర్


ఇటీవల రిలీజ్ అయిన కంచె ట్రైలర్ సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది.  రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ‘కంచె’ ట్రైలర్ విషయానికి వస్తే యుద్ద ట్యాంకర్ సన్నివేశం చూసి జక్కన్న షాక్ అయ్యాడట. నిజంగా ఈ చిత్రం చూస్తుంటే ఆప్పటి కాలంలో పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని చెప్పాడు. అయితే ఇప్పటివరకు క్రిష్ ఎన్నో మంచి చిత్రాలు తీసినప్పటికీ కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేదని కానీ ఈ కంచె తో కమర్షియల్ హిట్ కొట్టడం ఖాయమని రాజమౌళి అంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: