తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ... ఇప్పుడు మాస్ మహరాజు గా ఎదిగిన హీరో రవితేజ. తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ మినిమం గ్యారంటీ సినిమాలు తీసే హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. రవి సినిమాలన్నీ మంచి క్వాలిటీగా ఉండటమే కాకుండా మంచి కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టేవి. రవితేజ సినిమాలను సినీ నిర్మాతలు మరియు సినీ అభిమానులు బాగా ఇష్టపడేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి అది మారిపోయింది, ఈ మధ్య కాలం నుంచి రవితేజ వరుస పరాజయాలను చవి చూస్తున్నారు.
బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మహరాజ్ రవితేజ బాక్సాఫీస్ వద్ద బొర్లా పడింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్' తీస్తున్నాడు.. ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రలో మాస్మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఈ షెడ్యూల్ లో నటించారు. బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమెరా: సుందర్ రాజ్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్ర్కీన్ప్లే-దర్శకత్వం: సంపత్ నంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.