రామ్ గోపాల్ వర్మ అత్యంత సన్నిహితుడు పూరీ జగన్నాథ్ వర్మను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లు నేడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిరోజు ఎదో ఒక వివాదాస్పద కామెంట్స్ ను తన ట్విటర్ లో చేసే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా వినాయకుడుకి దణ్ణం పెడుతూ కనిపిస్తున్న ఫోటో సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు అందర్నీ ఆకర్షిస్తోంది.

వర్మ దేవుణ్ని నమ్మడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. చివరకు వర్మ నిర్మించే సినిమాల ప్రారంభోత్సవానికి ముందు జరిగే పూజా తతంగంలో కూడా వర్మ ఎప్పుడూ పాలు పంచుకోడు. అటువంటి వర్మ వినాయాకుడికి దణ్ణం పెడుతూ కనిపిస్తున్న ఫోటోను మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ తన ట్విటర్ లో పెట్టి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. అంతేకాదు వర్మ దేవుడికి తల వంచాడు అంటూ తన ట్విటర్ లో కామెంట్ చేసాడు మనోజ్. 

వినాయకుడు పాలు తాగాడు అన్న వార్త అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు వర్మ వినాయకుడుకి దణ్ణం పెట్టడం అంతే  సంచలనంగా మారింది. ఈ వార్తలు ఇలా ఉండగా వర్మ శిష్యుడు పూరి ఈ ఫోటో పై ఒక విచిత్ర కామెంట్ చేసాడు ‘‘ఇంత సడెన్ నువ్విక్కడికి ఎందుకొచ్చినట్లు. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని వర్మను వినాయకుడు తిడుతూ ఉండచ్చు’’ అని విచిత్రమైన కామెంట్ చేసాడు పూరి. 

అయితే ఈమధ్య వర్మ సినిమాలు కనీసం రెండవ వారం పోస్టర్ కూడ వేయించుకోలేని పరిస్థుతులలో ఉండటంతో నాస్థికుడైన వర్మ ఆస్థికుడిగా మారాడా? అంటూ మరికొందరు వర్మ పై సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా వినాయకుడిపై వర్మకు మనసులో ఎదో మాస్టర్ ప్లాన్ ఉన్నట్లే అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: