ప్రిన్స్ మహేష్ అభిమానులు హీరో నానీని టార్గెట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ అభిమానులకు నానీ పై ఈస్థాయిలో కోపం రావడానికి ఒక కారణం ఉంది. మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని అటు రాజమౌళి ఇటు మహేష్ ఈమధ్య తరుచు వారు మీడియాకు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో చెపుతూ వచ్చారు. ఈసినిమాను నాగార్జునతో అనేక సినిమాలు తీసిన డాక్టర్ కెఎల్ నారాయణ బ్యానర్ లో ఉంటుంది అన్న సూచనలు కూడ ఇచ్చారు. 

అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నది మాత్రం ఇద్దరు చెప్పలేకపోయారు. అయితే మహేష్ అభిమానులు మాత్రం మహేష్ రాజమౌళిల సినిమా ‘బాహుబలి 2’ తరువాత ఉంటుందని ఊహించుకుంటూ వచ్చారు. అయితే వారి ఊహల పై హీరో నాని నీళ్ళు జల్లుతూ చేసిన కామెంట్స్ ప్రిన్స్ అభిమానులకు తీవ్ర అసంతృప్తి తెప్పించినట్లు టాక్. 

ఇక వివరాలలోకి వెళ్తే నాని తాను లేటెస్ట్ గా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు తీవ్ర అసంతృప్తిని తెప్పించాయి అని తెలుస్తోంది. నానీతో ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ‘బాహుబలి 2’ లో మీకు పాత్ర ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘బాహుబలి 2’ లో తనకు పాత్ర ఉంటుందో లేదో తెలియదు కాని ఆ తరువాత రాజామౌళి నిర్మించబోయే ‘ఈగ’ సీక్వెల్ లో తనకు పాత్ర ఉంటుంది అంటూ కామెంట్ చేసాడు. 

ఈ మాటలు బట్టి రాజమౌళి ‘బాహుబలి 2’ తరువాత తీసేది ‘ఈగ’ సీక్వెల్ కానీ తమ అభిమాన హీరో మహేష్ తో సినిమా కాదని ఒక నిర్ణయానికి వచ్చిన మహేష్ అభిమానులు ‘ఈగ’ సీక్వెల్ ను రాజమౌళి ఎత్తుకుంటే 2018 వరకు రాజమౌళికి ఖాళీ ఉండదు కాబట్టి ఇక రాజమౌళి సినిమాలో మహేష్ ను చూడాలన్న ఆశ ఇప్పట్లో తీరేలా లేదని భావిస్తూ నాని మహేష్ రాజమౌళిల సినిమాకు విలన్ గా మారాడు అంటూ సెటైర్లు వేస్తున్నారని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: