యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించినవి కేవలం రెండు సినిమాలే అయినా ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయంసాధించడoతో ప్రస్తుతం రాజ్ తరుణ్ హవా మంచి స్పీడ్ మీద ఉంది. ఈమధ్యనే విడుదల అయిన ఇతడి ‘సినిమా చూపిస్త మావా’ ఈ ఏడు విడుదల అయిన చిన్న సినిమాలలో టాప్ హిట్ గా నిలవడమే కాకుండా సుమారు 10 కోట్ల పైన కలెక్షన్స్ వసూలు చేసింది అన్న వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన సొంత బ్యానర్లో తీస్తున్న ‘కుమారి 21 ఎఫ్’ మూవీలో కూడ హీరోగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన ఈసినిమా సుకుమార్ జూనియర్ సినిమాతో బిజీ కావడం వలన విడుదల ఆలస్యం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన సుకుమార్ కొన్ని మార్పులు చేశాడని టాక్. అంతేకాదు ఈసినిమా టోటల్ గా బాగానే వచ్చిందంటూ కామెంట్ చేసాడని వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్, షీనా బజాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా ప్రమోట్ చేయడానికి స్వయంగా జూనియర్ రంగంలోకి దిగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈసినిమా ప్రమోషనల్ సాంగ్ ను జూనియర్ లండన్ నుంచి విడుదల చేసి ఈసినిమాకు క్రేజ్ పెంచడానికి అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈసినిమా ఆడియో ఫంక్షన్ కు కూడ జూనియర్ అతిథిగా రాబోతున్నాడని టాక్. లండన్ నుంచి జూనియర్ సుకుమార్ లు తిరిగి వచ్చిన తరువాత ఈమూవీ ఆడియో ఫంక్షన్ ఘనంగా చేయాలని సుకుమార్ ప్లాన్ చేసాడు అని వార్తలు వస్తున్నాయి.
ఈవార్తలు ఇలా ఉండగా రాజ్ తరుణ్ సీనియర్ వంశీ కాంబినేషన్ లో రాబోతున్న ‘లేడీస్ టైలర్’ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాజ్ తరుణ్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించడం మరో విశేషం. ఏది ఎలా ఉన్న ప్రస్తుతం ఈ యంగ్ హీరో అదృష్టం బాగుంది..