ఈ మద్య హైదరబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా మంది సెలబ్రెటీలు..పొలిటికల్ లీడర్స్,సినిమాకు సంబంధించిన వాళ్లు చాలా మంది పట్టుబడుతున్నారు. అంతే కాదు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరగడం..ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం  జరుగుతున్నాయి. ప‌రిమితికి మించిన స్థాయిలో మందేసి వాహ‌నాల‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్టు డ్రైవ్ చేసుకుంటూ వ‌స్తూ ..పోలీసుల‌కు దొరికిపోతున్నారు. మందుబాబుల్లో ప‌రివ‌ర్త‌న తీసుకువ‌చ్చేందుకు హైద‌రాబాద్ పోలీసులు వినూత్న ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు.

తాజాగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో మార్పు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా సినీ సెలబ్రెటీలతో కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందని భావించిన పోలీసులు ఆ మద్య మంచు లక్ష్మి, కమెడియన్, పొలిటికల్ లీడర్ బాబు మోహన్ కౌన్సిలింగ్ ఇప్పించారు. తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ వేణు, సీరియ‌ల్ న‌టుడు విజ‌య్‌తో మందుబాబుల‌కు కౌన్సెలింగ్ ఇప్పించారు. అబీడ్స్ పోలీసుల కోరిక మేర‌కు వీరిద్ద‌రు స్వ‌యంగా రంగంలోకి దిగి మందుబాబుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. తాగి వాహ‌నాలు న‌డ‌పి ప్ర‌మాదాలు కొని తెచ్చుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

 డ్రంక్ అండ్ డ్రైవ్ పరిక్షిస్తున్న పోలీసులు


ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మాకు చాలా ఉత్తేజం వస్తుందని.. హైదరాబాద్ వచ్చాక పోలీసు దెబ్బకు చాలా మారిపోయానని..ఈ మద్య వారు చేసే తనిఖీలు చూస్తుంటే తప్పుగా నడిపే వాహనదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. న ఫ్యామిలీ త‌న‌కు ఇంపార్టెంట్ అని..ఆ విష‌యాన్ని గుర్తించే తాను మారిన‌ట్టు చెప్పాడు. అవ‌స‌ర‌మైతే డ్రైవ‌ర్‌ను పెట్టుకుంటా.. లేట్ నైట్ పార్టీస్‌కు వెళితే ఓ క్యాబ్‌ను బుక్ చేసుకుంటా… అంతేకానీ తాగి వాహ‌నాన్ని న‌డ‌ప‌ద‌ల‌చుకోలేద‌ని… ద‌య‌చేసి తాగి వాహ‌నాల‌ను న‌డ‌వ‌వ‌ద్ద‌ని వేణు మందుబాబుల‌కు క్లాస్ తీసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: