తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసుల ఎంట్రీతో ఫుల్ జోష్ లో ఉంది.. తాజాగా మెగా స్టార్ కుటుంబం నుంచి సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వస్తే.. నాగ్ వారసుడిగా అఖిల్ ఎంట్రీ ఇస్తున్నాడు..త్వరలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్క్ష ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎవరి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో మొదట్లో విలన్ గా వచ్చి తర్వాత హీరోగా ఎదిగారు శ్రీకాంత్.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ ఊహను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం..కుమారులు రోషన్, రోహన్, కుమార్తో మేధ. ఇప్పుడు శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ బాధ్యతను అక్కినేని నాగార్జున తీసుకున్నట్టు సమాచారం. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మించే కొత్త సినిమా ద్వారా రోషన్‌ని పరిచయం చేయనున్నట్టు తాజా సమాచారం.  

శ్రీకాంత్, ఊహ,రోషన్ పక్కనే నాగార్జున


ఈ సినిమాను హాలీవుడ్ స్ఫూర్తితో నిర్మిస్తారని టాక్.హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినీ ప్రవేశం చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్ పై రోషన్ ని పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వం వహించేది అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా విద్యార్దులు. ‘నిర్మల కాన్వెంట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: