తెలుగులో మరో సినిమా ఇబ్బందుల్లో చిక్కుకుంది. సూర్య రాజు దర్శకత్వోం రూపొందిన సినిమా మైత్రీ. ఈ సినిమాను రాజేష్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, రాజేష్ కుమార్ తన వద్ద రుణం తీసుకున్నాడని, తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఈ మైత్రీ సినిమాను విడుదల చేయరాదంటూ మూర్తి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో మైత్రీ విడుదల సందిగ్థంలో పడింది. మైత్రీ సినిమాలో నవదీప్-సదా జంటగా నటించారు. ఈ సినిమాలో సదా అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: