దగ్గుబాటి రానా తాజా సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. రానా నటించిన కొత్త సినిమా కృష్ణం వందే జగద్గురం. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదల చేస్తున్నారు. రానా కెరీర్ లోనే ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కృష్ణం వందే జగద్గురం సినిమా 1000కు పైగా ధియేటర్లలో విడుదల అవుతుంది. గమ్యం, వేదం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఈ చిత్రంపై అంచనాలను పెంచుతుంది. హీరోయిన్ గా నటించిన నయనతార ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కృష్ణం వందే జగద్గురం సినిమా కోసం మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకాదరణ పొందుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: