ప్రపంచ దేశంలో టటూలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ పెరిగింది...ముఖ్యంగా సిని సెలబ్రెటీస్ ఈ టటూస్ వేయించుకోవడం వల్ల సామాన్య జనాలకు కూడా వీటిపై విపరీతమైన మోజు ఏర్పడింది. అయితే ఈ టటూస్ ఒక్కొక్కరు ఒకో రకంగా వేయించుకోవడం అలవాటైంది..ఇక హాలవుడ్ నటీమణులైతే కొన్ని సీక్రెట్ ప్లేస్ ల్లో కూడా టటూస్ వేయించుకుంటున్నారు.  తాజాగా హాలీవుడ్ నటి, పాప్ స్టార్ సెలీనా గోమోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ఇటీవల అమెరికాలోని మియామీ బీచ్ లో బికినీ దరించి ఈ అమ్మడు ఫోటో షూట్ లో పాల్గొంది..ఈ సమయంలో  సెలీనా గోమేజ్ తొడపై భాగంలో నడుము కింది భాగంలో హిందువులకు అతి పవిత్రమైన ''ఓం '' ని టాటూగా వేయించుకుని వివాదాన్ని సృష్టించింది . దాంతో అమెరికాలో సెలీనా గోమేజ్ టాటూ పట్ల హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు . ఎడమ తొడపై భాగంలో హిందువులకు అతి పవిత్రమైన ఓం ని టాటూ గా వేయించుకొని చేసిన ఫోటో షూట్ బయటకు రావడంతో అమెరికాలో ఉన్న భారతీయులు గోమేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు . అర్థనగ్నంగా, పూర్తి నగ్నంగా నటించే ఈ తారలకు ఇది పెద్ద విషయమేమి కాదు. అయితే ఈ సందర్భంగా ఆమె తన తొడపై వేయించుకున్న టాటూ కెమెరాకు చిక్కింది. సినిమా తారలు టాటూలు వేయించుకోవడం మామూలే.

 సెలీనా గోమేజ్ తొడపై భాగంలో ఓం టటూ


ఈ టాటూ భారత దేశానికి చెందినది కావడం, అందులోనూ హిందువుల చిహ్నం ‘ఓం' టాటూ కావడంతో హాట్ టాపిక్ అయింది. సర్వశక్తికి మూలాధారమైన ఓంకార నాధాన్ని అమె తన తొడలపై వేయించుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని హిందు నెట్ జనులు మండిపడుతున్నారు. ప్రముఖ హిందూ ధార్మిక ప్రచారకర్త రాజన్ జెడ్ మాట్లాడుతూ.. హిందువులు తమ పూజలన్నింటినీ ఓంకారంతోనే ప్రారంభించి.. ఓంకారంతోనే ముగిస్తారని.. అలాంటి అత్యంత పవిత్రమైన హిందువుల చిహ్నాన్ని అభ్యంతకర ప్రదేశాలలో వేయించుకుని సెలినీ తప్పుచేసిందని అన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: