‘శ్రీమంతుడు’ తో టాలీవుడ్ శ్రీమంతుడుగా మారిన మహేష్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా 2017 లో ఉండవచ్చు అని అంటున్నారు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తయారు చేస్తున్న ‘గరుడ’ స్క్రిప్ట్ మహేష్ కోసమే అని అంటున్నారు.

 ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీసే స్థాయి మన తెలుగు నిర్మాతలకు లేదు కాబట్టి ఒక ప్రముఖ బాలీవుడ్ కార్పోరేట్ నిర్మాణ సంస్థ ఒక అంతర్జాతీయ సినిమా నిర్మాణ సంస్థతో కలిపి ఈ ప్రయోగం చేయడానికి రాజమౌళి ప్రాధమిక చర్చలు జరుపుతున్నట్లు టాక్. అయితే ‘గరుడ’ స్క్రిప్ట్ పూర్తిగా చూసిన తరువాత మాత్రమే తన నిర్ణయాన్ని చెపుతాము అని హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థ చెప్పడంతో విజయేంద్ర ప్రసాద్ ఒక వైపు ‘బాహుబలి 2’ స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నా ‘గరుడ’ స్క్రిప్ట్ గురించి అప్పుడే కొంత వరకు తన ఆలోచనలను ప్రారంభించాడు అని తెలుస్తోంది.
 
మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో రూపొందబోయే ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన లైన్ ను ఇప్పటికే రాజమౌళి మహేష్ కు వివరించినట్లు టాక్. ముందుగా ఈ గరుడ స్క్రిప్ట్ కు ప్రభాస్ జూనియర్ పేర్లను రాజమౌళి తన మనసులో ఆలోచించినా ఈ స్క్రిప్ట్ లోని హీరో పాత్ర రీత్యా మహేష్ ఈ పాత్రకు అన్ని విధాల సరిపోతాడని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. ‘బాహుబలి 2’ తరువాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది అని అంటున్నారు. 

ఇప్పటికే వినాయక్ మహేష్ తో 100 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ సినిమాను త్వరలో తీస్తాను అని ప్రకటించిన నేపధ్యంలో అది మొదలు కాకుండానే రాజమౌళి 500 కోట్ల సినిమా కూడ మహేష్ ఖాతాలో పడితే ఇక వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు మహేష్ శాశ్విత చిరునామాగా మారిపోతాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: