సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిచాలనేది గత 3 సంవత్సరాలుగా మణిరత్నం చేస్తున్న ప్రయత్నం. అయితే మణిరత్నం చేస్తున్న ప్రయత్నానికి మొదటి నుండి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు మరోసారి వేగవంతం అయినట్టు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గత ఏడాది మణిరత్నం, నాగార్జున-మహేష్ బాబులను హీరోలుగా మల్టీస్టారర్ ని ప్లాన్ చేశాడు.


కానీ తరువాత అది ఆగిపోయింది. ఆ తరువాత మణిరత్నం “ఓకే బంగారం” సినిమాలో బిజీ అయిపోయి, ఆ సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టేసారు. ఈ మూవీ తరువాత మణిరత్నం తన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ని తెరపైకి తెచ్చారు. దల్క్వేర్ సల్మాన్ – కార్తీలతో ఈ సినిమాని రూపొందించాలని కాస్టింగ్ ఫైనల్ చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం దల్క్వేర్ సల్మాన్, నిత్యామీనన్ కాంబినేషన్ లో ఓ మూవీ సెట్స్ మీద ఉంది.


మరో సంవత్సరం వరకూ తన డేట్స్ బిజి. అప్పటి వరకూ మణిరత్నం తన ప్రాజెక్ట్ ని ఆపుకొని కూర్చోవలసిందే. ఈ గ్యాప్ లో మణిరత్నం ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుని తీసుకురావాలని చూస్తున్నారు. మొదట అనుకున్నట్టే మహేష్, నాగార్జునలని ఇందులో ఒప్పించాలని అనుకుంటున్నాడు. ఇందులోభాగంగానే మహేష్ బాబుని కలిసి తన ప్రాజెక్ట్ గురించి మణిశర్మ అప్రోచ్ అయ్యాడు.


అయితే మహేష్ బ్రహ్మోత్సవం  షూటింగ్ అనంతరం, కొద్దిపాటి కండిషన్స్ తో మణిశర్మ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వలం 3 నెలల మాత్రమే తను డేట్స్ ని అడ్జెట్ చేయగలనని మహేష్ చెప్పుకొచ్చాడంట. ఇక నాగార్జున అయితే మణిరత్నంకి “ఆల్వేస్ వెల్ కం” అనే బోర్డ్ ని పెట్టి కూర్చున్నాడు. మొత్తంగా మణిరత్నం ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలిమరి.



మరింత సమాచారం తెలుసుకోండి: