క్రియేటివ్ దర్శకుడుగా ఎన్నో సినిమాలను తీసిన కృష్ణవంశీ కొన్ని ప్రయోగాత్మ సినిమాలు తీసి కూడ విజయం సాధించాడు. ‘సింధూరం’, ‘ఖడ్గం’, ‘మహాత్మ’ లాంటి సినిమాలు కృష్ణవంశీలోని క్రియేటివిటీని బయటకు తీసాయి. అయితే గత సంవత్సరం ఈయన తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా అనుకున్న విజయం సాధించలేక పోవడంతో అతడిలో కసి పెరిగి ఎదో విధంగా హిట్ కొట్టాలి అన్న కసితో ‘రుద్రాక్ష’ అన్న పేరుతో ఒక స్క్రిప్ట్ ను కృష్ణవంశీ రెడీ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం హారర్ సినిమాల హవా టాలీవుడ్ లో నడుస్తూ ఉండటంతో ఈ జోనర్ లో ఒక సినిమా తీసి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి కృష్ణవంశీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ కథ స్క్రిప్ట్ నచ్చడంతో ప్రకాష్ రాజ్ దిల్ తో కలిసి ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

అయితే సమస్య ఈ ‘రుద్రాక్ష’ లో నటించి భయపెట్టబోయే హీరోయిన్ దగ్గరే వచ్చింది అని అంటున్నారు. మొట్టమొదట ఈ కథను కాజల్ కు వినిపిస్తే ఈ కథలో తాను నటించి భయ పెట్టలేనని చెప్పినట్లు టాక్. ఆ తరువాత ఇదే కథను సమంతకు వినిపిస్తే తన దగ్గర డేట్స్ ఎక్కడ ఉన్నాయని కృష్ణవంశీ దగ్గర నుంచి జారుకున్నట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇక అనుష్క వైపు కృష్ణవంశీ చూస్తున్నా ఆమె డేట్స్ కూడ అందుబాటులో లేకపోవడంతో ఈ ‘రుద్రాక్ష’ ను ఏ హీరోయిన్ కు వేయాలి అన్న సందిగద్ధంలో కృష్ణవంశీ రోజులు గడుపుతున్నట్లు టాక్. 

దీనితో త్రిష ప్రస్తుతం నటిస్తున్న ‘నాయకి’ సక్సస్ అయితే కృష్ణవంశీ ‘రుద్రాక్ష’ కు సమస్య తీరుతుంది అంటూ టాలీవుడ్ లో సెటైర్లు పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: