సినిమాల్లో ఒక్కసారి హిట్ పెయిర్ అనిపించుకుంటే దాన్నే రిపీట్ చేయడానికి చూస్తారు దర్శక నిర్మాతలు. ఇక హీరోలైతే ఒక్కసారి సెంటిమెంట్ అనుకుంటే దాన్ని వదలనే వదలరు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అదే సెంటిమెంట్ తో తనకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎంటా కథా కామీషు అనే కదా మీ డౌట్ అయితే వివరాల్లోకి వెళ్లేద్దాం.. ప్రస్తుతం రామ్ చరణ్ 'బ్రూస్ లీ' రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'తని ఒరువన్' సినిమా రీమేక్ చేయనున్నాడని తెలిసిందే.


ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా కాజల్ని అనుకున్నా అమ్మడు రెమ్యునరేషన్ ఆకాశాన్నంటేలా చెబుతుందని ధనుష్ అనేకుడు సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆడియెన్స్ ని అలరించిన అంయారా దస్తర్ మీద కన్ను పడ్డది దర్శక నిర్మాతలకు. కాజల్ ఈ సినిమాను చేయడానికి 2 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. అసలే ఫేడ్ అవుట్ అవుతున్న ఈ టైంలో వచ్చిన ఛాన్స్ కాస్త కాజల్ రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి చేజార్చుకుంది అనుకున్నారంతా. కాని చరణ్ మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని పెట్టాల్సిందే అని గట్టిగా పట్టుపడుతున్నాడట.


జయసూర్యలో కాజల్, విశాల్ :

 
అంతేకాదు ఈ విషయం మీద దర్శక నిర్మాతలతో వాగ్వివాదానికి కూడా దిగాడని టాక్. చరణ్ మాత్రం కాజల్ ని ఎలాగోలా కన్విన్స్ చేసి సినిమాకు తక్కువ రెమ్యునరేషన్ కే ఒప్పిస్తానని అంటున్నాడట. రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమా సూపర్ హిట్ అయ్యాయి. అందుకే తమది హిట్ పెయిర్ కాబట్టి ఈ సినిమాలో మళ్లీ కాజల్ ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు చరణ్.


మరి చరణ్ నడిపిస్తున్న ఈ మధ్యవర్తిత్వం ఫలిస్తుందో లేదో తెలియదు. కాని కాజల్ మాత్రం 20 నిమిషాల సీన్ కు 2 కోట్లు డిమాండ్ చేస్తుండటం దానికి దర్శక నిర్మాతలు బేరమాడటం చూస్తుంటే ఇంకా తెలుగులో కాజల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే అనిపిస్తుంది. మరి సినిమాలో అమ్మడు ఉంటుందా లేక ఊడుతుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: