గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన వార్తలు హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి. అసలు చిరంజీవి 150వ సినిమా ఉంటుందా? లేదా? అనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది అభిమానులకి. కొద్దిరోజుల క్రితం పూరీ జగన్నాద్ ఈ మూవీపై చేసిన కామెంట్స్ కి చిరంజీవి హర్ట్ అయ్యాడని కొందరు అంటుంటే, మరికొందరేమో పూరీని చిరు ఇప్పటికైనా అర్ధం చేసుకుంటాడని అంటున్నారు.


ఏదేమైనా వీరిద్దరి మధ్య పెద్ద కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారాన్ని చక్కబట్టే ప్రయత్నంగా రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. తక్కువ సమయంలో రామ్ చరణ్, తన తండ్రికి..పూరీ జగన్నాధ్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేశాడు. తాజాగా పూరీ జగన్నాద్ ని చిరు 150వ సినిమాపై పనిచేయాల్సిందిగా చరణ్ కోరాడు. పూర్తి కథతో తన దగ్గరకు రావాలని, చిరంజీవి గారు అదే భావిస్తున్నారని తెలియచేశాడు.


ప్రస్తుతం పూరీ జగన్నాద్, ఆటోజాని మూవీకి సంబంధించిన 2వ పార్ట్ పై కసరత్తులు మొదలుపెట్టాడు. మరో వారంరోజుల తరువాత జరగబోతున్న స్టోరి డిస్కషన్స్ లో చిరంజీవి, పూరీ, రామ్ చరణ్ లు పాల్గొనబోతున్నారు. రెండు, మూడు వరుస సిట్టింగ్ ల తరువాత కథని ఫైనల్ చేసే దిశగా చిరంజీవి ఆసక్తి చూపుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: