బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల తార శ్వేతాబస్ ప్రస్తుతం సినిమా చాన్సులు లేక ఖాళీగా ఉంది. ఈ అమ్మడు ఓ వ్యభిచారం  కేసులో అరెస్ట్ అయి.. నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే.  అయితే తను నిర్ధోషిని అని తనను  కావాలనే ఇరికించారని ఆమె పేర్కొంది. స్వేతబస్  జైలులో ఉన్నప్పుడు బోలెడంతమంది సినిమా ఛాన్సులిస్తామంటూ సింపథి చూపించారు. తమ సినిమాల్లో ఆఫర్ ఇస్తామని ఈ అమ్మడిని తెగ ఊరించారు.

ఇక శ్వేతాబస్ ఉదంతం ఇండ‌స్ట్రీలోని కొంత మందికి వ‌ణుకుపుట్టించే వ్యవ‌హారంగా మారింది. ఎందుకంటే ఆ హీరోయిన్ పెద్ద బ్యానర్ లలో నటించడమే కాకుండా, చాలా మంది హీరోలతో ఇప్పటికీ ట‌చ్‌లో ఉండ‌ట‌మే అంద‌రిని భ‌య‌ప‌డేలా చేసింది. మరో వైపు ఇక బాలీవుడ్ లో అయితే ఈ అమ్మడికి తెగ సంఘీభావం తెలిపారు.. తమ నెక్ట్ సినిమాలో ఫిక్స్ అన్నట్లు మాట్లాడారు  మీడియాలో హడావుడి చేశారు. నిజానికి  శ్వేతాకు ఇచ్చిన మాటలన్నీ నీటి మీద బుడగలే అయ్యాయి ఈ అమ్మడు బయటకు వచ్చి ఆరు నెలలు అయినా కనీసం సైడ్ పాత్రలకు కూడా చాన్సు రాలేదు.  

తాజాగా బుల్లితెరపై శ్వేతాబస్ కి ఘోర అవమానం జరిగింది.. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘భూం భూం’ షోలో శ్వేతాబస్ గెస్ట్ గా వచ్చింది..ఈ సందర్భంగా అక్కడున్న ఆడియన్స్ ని మంచు లక్ష్మి మీరు  శ్వేత బస్ ని ఏవైనా ప్రశ్నలు వేయాలనుకుంటున్నారా అంటూ అడగగానే ఒక అమ్మాయి లేచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద బ్యాడ్ సంఘటన జరిగింది కదా..మరి లైఫ్ లో ఏదంటే భయం అని అడగగానే వెంటనే శ్వేతాబస్ స్పందించి చేయి ఊపుతూ.. సీరియస్ గా నెక్ట్ క్వచ్చన్ అంటూ ఆ అమ్మాయిని కూర్చోమని చెప్పింది..హఠాత్తుగా ఈ పరిణామం జరగడంతో మంచు లక్ష్మి కూడా ఆశ్చర్య పోయింది.

భూమ్..భూమ్ షోలో శ్వేతాబసు, మంచు లక్ష్మి


మొత్తానికి ప్రోగ్రామ్స్ కి గెస్టులను పిలి వింత వింత క్వచ్చ న్లు వేయడం అవి చెప్పలేక వారు తడబడటం..ఈ మద్య కాలంలో బాగానే చూస్తున్నాం..అంతెందుకు ఆ మద్య ఓ టివిషోలో డిబెట్ జరుగుతుండగానే లైవ్ లోనే దీపా శర్మ అనే మహిళ ఓం జీ అనే సాధువును చెంప చెల్లుమనిపించింది..వెంటనే ఆయన కూడా చెంప చెల్లుమనిపించారు..ఇలా ఆ ప్రోగ్రాం రచ్చ రచ్చ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: