తన తూటాల లాంటి మాటలతో ఎన్నో సినిమాలకు ఘన విజయం చేకూర్చిన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నందమూరి వార్ మధ్య చిక్కుకోకుండా చాలా వ్యుహాత్మకంగా బయటపడటానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ బాలకృష్ణ ‘డిక్టేటర్’ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల అవుతూ ఉండటంతో ఆ వార్ మధ్య తాను నలిగిపోకోడదని త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి.

నితిన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ 'అ..ఆ'.  ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ఇప్పటికే ప్రారంభం అయి అక్టోబర్10 నుంచి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ తో స్పీడ్ అందుకోనున్నది. కంటిన్యూగా షూటింగ్ జరిపి, సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నాడు. 

అయితే ఇప్పుడు ఈసినిమా విడుదల వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డేకి మారింది అని అంటున్నారు. సంక్రాంతి బరిలో రెండు భారీ మాస్ సినిమాలు పోటీ పడుతూ ఉండటంతో ఆ రెండిటి మధ్య తన సినిమా చిక్కుకుంటే తాను ఎంత బాగా తీసినా ఆ మాస్ సినిమాల హోరులో తన ‘అ ఆ’ కొట్టుకు పోతుందని త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. 

ఈసినిమా విడుదల తేదీని ప్రస్తుతానికి ఫిబ్రవరికి మార్చినా సినిమా షూటింగ్ మాత్రం ఏక బిగిన మూడు నెలలలో పూర్తి చేసి డిసెంబర్ కు త్రివిక్రమ్ తన ‘అ ఆ’ ను రెడీ పెట్టడం చూస్తూ ఉంటే ఒకవేళ ఈ నందమూరి వార్ లో ఏ సినిమా అయినా వెనక అడుగు వేస్తే తన ‘అ ఆ’ ను సంక్రాంతికి రంగంలోకి దింపాలని ఆలోచన అని అంటున్నారు. అందుకే త్రివిక్రమ్ ను వ్యూహాత్మక మాటల మాత్రికుడు అని అంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: