ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ మూవీ అంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ త్రివిక్రమ్ మూవీని చూడటానికి ప్రత్యేకమైన ఆసక్తిని చూపుతారు. కానీ తాజాగా త్రివిక్రమ్ తన అప్ కమింగ్ మూవీతో ప్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, త్రివిక్రమ్ శ్రీనివాస్– నితిన్ కాంబినేషన్ లో ఓ క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రానుందనే విషయం తెలిసిందే. ఆ మూవీకి ‘అ..’ అనే వెరైటీ టైటిల్ ని పెట్టాడు త్రివిక్రమ్. మొన్నటి వరకూ సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా, కచ్ఛితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే సినిమా అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ లవర్స్ డే కి మారిపోయింది.


రిలీజ్ డేట్ తో పాటు మూవీపై ఉన్న టాక్ కూడ మారిపోయింది. “ప్యామిలీ చిత్రం అయితే సంక్రాంతికి రిలీజ్ చేయాలి కానీ, ఇలా లవర్స్ డే కి ఎందుకు రిలీజ్ చేయటం. ఈ మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్ లు కూడ ఉన్నాయి. ముఖ్యంగా లవర్స్ ని అమితంగా ఆకట్టునే సినిమా గా ‘అ..’ మూవీ ఉంది.


అందుకే కొంత తెలుగు...కొంత డబుల్ మీనింగ్ వచ్చే ‘అ..’ అనే టైటిల్ ని త్రివిక్రమ్ సెలెక్ట్  చేసుకున్నాడు” అని ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ సైతం మారుతి స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడంటూ, తన అప్ కమింగ్ మూవీపై నెగిటివ్ టాక్స్ స్ర్పెడ్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: