వర్దమాన సినీ హీరో రైడ్, కోడిపుంజు ఫేం తనీష్ అక్టోబర్ 1న జూబ్లి హిల్స్ రోడ్ నెంబర్ 10 లో అర్దరాత్రి ద్వి చక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. జూబ్లిహిల్స్ పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి కేసు పరిశీలుస్తున్నారు. ఈ హీరో మధ్యం మత్తులో ఉన్నట్లు భాథితులు ఆరోపిస్తున్నారు.గురువారం రాత్రి తన కారుతో రోడ్ నెంబర్ 45లో ముందు వెళ్తోన్న సురేష్ అనే వ్యక్తి స్కూటరిస్ట్ ను ఢికొట్టి ఆగకుండా వెళ్లిపోయాడట. దీంతో బాధితుడు కారును వెంబడించి పట్టుకున్నాడట. అనంతరం ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వివాదం కూడా చోటు చేసుకుందట. దీంతో ఇద్దరి పై పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.
డ్రైవింగ్ చేసే సమయంలో తనీష్ ..త్రాగి ఉన్నాడని ఆరోపణ. ఈ నేఫధ్యంలో సురేష్ అతనిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెట్టారు. తర్వాత సురేష్ పై తనీష్ సైతం ఓ కేసుని ఫైల్ చేసారు. తర్వాత జూబ్లిహిల్స్ పోలీసులు వీరిద్దరిపై సెక్షన్ స 70(బి) కేసు పెట్టడం జరిగింది. ఆ విధంగా నాంపల్లి కోర్టుకు తనీష్ హాజరయ్యారు. అప్పుడు కోర్టు 50 రూపాయల ఫైన్ వేసింది. ప్రస్తుతం తెలుగులో తనిష్ కు సినిమాలు లేవు.
జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు నరేష్, హీరో తనిష్
ఆ మద్య మంచు హీరోలు నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో కీ రోల్ పోషించాడు. ఇక పోతే తనీష్, మోహిత జంటగా శ్రీ చీర్ల మూవీస్ రూపొందిస్తున్న సినిమా ఆ మధ్యన ప్రారంభోత్సవం జరిగింది. యశస్విని సమర్పిస్తున్నారు. సంజీవ్ మేగోటి దర్శకుడు. శ్రీనివాస యాదవ్ నిర్మాత.