మంచు విష్ణు లేటెస్ట్ సినిమా బడ్జెట్ 250 కోట్లు అని ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తలను విన్న వారు కొంతమంది ఆశ్చర్య పోతూ ఉంటే మరికొందరు ‘జోక్ ఆఫ్ ది డే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాల బడ్జెట్ 300 కోట్లు అంటేనే ఆశ్చర్య పోయిన టాలీవుడ్ ఇప్పటికి వచ్చి తన కెరియర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడలేని విష్ణు సినిమా పై 250 కోట్లు పెట్టుబడి పెట్టినా ఆ సినిమాను ఎవరు కొంటారు అంటూ సెటైర్లు పడుతున్నాయి.

ఇక ఆసక్తికరమైన ఈ న్యూస్ కు సంబంధించిన వివరాలలోకి వెళితే తనికెళ్ళ భరణి మంచు విష్ణుతో తీయబోతున్న ‘కన్నప్ప’ సినిమాకు 250 కోట్ల బడ్జెట్ అవుతుందని మంచు కుటుంబం అంచనాకు వచ్చింది అని టాక్. ఇప్పటికే తన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన తనికెళ్ళ భరణి ఈసినిమా షూటింగ్ కు సిద్దంగా ఉండమని విష్ణుకు సంకేతాలు పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈసినిమాను 250 కోట్ల బడ్జెట్ తో మంచు కుటుంబం నిర్మించడం వెనుక ఒక కారణం వుంది అని అంటున్నారు.

ఈసినిమాను హాలీవుడ్ ప్రమాణాలతో తెలుగు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీయడానికి మంచు ఫ్యామిలీ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఓ గ్రాఫికల్ టీమ్ ని హైదరాబాద్ లో ఒక హొటల్ లో దించి వాళ్లతో వర్క్ చేయిస్తున్నాడట మంచు వారి అబ్బాయి.‘కన్నప్ప’ను మామూలు తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ డిస్నీ సినిమాల స్థాయిలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో తీయాలని మంచు విష్ణు కోరికట.

ఈ ప్రాజెక్ట్ కు ఒక అంతర్జాతీయ సినిమా నిర్మాణ కంపెనీ సహాయం లభించింది అని విష్ణు చెపుతున్నట్లు టాక్. అయితే ఎంత అంతర్జాతీయ సినిమా నిర్మాణ కంపెనీ అయినా విష్ణు మార్కెట్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి సాహసం చేస్తుందా అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా ఈసినిమా విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: