గత కొద్దిరోజులుగా వర్మ పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవ ఇంకా ముదిరిందని చెప్పొచ్చు. ఏకంగా వర్మ ప్రాణానికే అపాయమొచ్చినంత పనైందని చెప్పొచ్చు. ఏంటి పవన్ ఫ్యాన్స్ ఏమన్నా వర్మ పై ఎటాక్ చేశారా అని మీకు డౌట్ రావొచ్చు. అదేం కాదు కాని అంతకంటే ఎక్కువే చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ప్రిన్స్ మహేష్ బాబుకి 15 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. కాని పవన్ కళ్యాన్ కి 6 లక్షల మందే ఉన్నారని.. పవన్ ఫ్యాన్స్ చదువుకున్న వారు తక్కువ ఉన్నారని ఎగతాలి చేసిన వర్మకు అంతే ధీటుగా సమాధానం చెప్పారు పవన్ ఫ్యాన్స్.


అసలే పవనిజం మరి నాఇష్టం అంటున్న వర్మ మాటలు పడనిస్తారా.. అందుకే హటాత్తుగా మరణించిన రాం గోపాల్ వర్మ.. సిని పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న సిని ప్రముఖులు ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సిని ప్రపంచం అని మెసేజ్ ఉన్న పిక్ తో పాటుగా ఆర్.ఐ.పి ఆర్జివి అని దీపంతో వర్మ ఫోటోకి దండ వేశారు. అయితే దీనికి అంతే ధీటుగా వర్మ కూడా తన సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాన్ రైతులను ఎడ్యుకెట్ చేయడం కాదు వచ్చి తన ఫ్యాన్స్ ని ఎడ్యుకేట్ చేయాలని అన్నాడు.

వర్మ మీద పవన్ ఫ్యాన్స్ చేసిన పిక్ :


ఈ మాటలనే ఇంగ్లీష్ లో చెబుతూ మహేష్ ఫ్యాన్స్ వీటిని ట్రాస్ లేట్ చేసి పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి చెప్పండంటూ ట్విట్టర్ లో ధ్వజమెత్తాడు. మరి ఫ్యాన్స్ చేసిన ఈ పనికి వర్మ మాత్రం ఊగిపోతున్నాడనిపిస్తుంది. అయితే ముందు ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి ఆపై వారి కోపానికి బలైన వర్మకు షాక్ తగిలిందనే చెప్పొచ్చు. 


మరి ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందో చూడాలి. ప్రస్తూఅనికైతే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వర్మ చనిపోయాడని పవన్ ఫ్యాన్స్ తయారు చేసిన ఆ పిక్ మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. మరి దీనికి ముగింపు ఎవరు పలుకుతారో తెలియదు కాని ప్రస్తుతానికైతే పవన్ ఫ్యాన్స్ కు, వర్మకు గొడవ రచ్చ కెక్కిందనే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: