నాగార్జున చాలాకాలం తరువాత ద్విపాత్రాభినయం చేస్తూ ఇద్దరి హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ షూటింగ్ ఈమధ్యనే పూర్తి అయింది. తనకు సెంటిమెంట్ రీత్యా బాగా కలిసి వచ్చే డిసెంబర్ లో ఈసినిమాను విడుదల చేయడానికి నాగార్జున ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ఈసినిమాలో యాంకర్ అనసూయ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  

అయితే ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించి విడుదల చేస్తున్న ఫోటోలలో ఎక్కువ నాగ్ అనసూయల ఫోటోలు ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది అని టాక్. నాగ్ ఏ హీరోయిన్ తో నటించినా ఆ హీరోయిన్ తో నాగ్ కెమిస్ట్రీ అదిరిపోతుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో  కూడ ఏకంగా నలుగురు అమ్మాయిలతో ఆడిపాడుతున్నాడు నాగ్. రమ్యకృష్ణ - లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తుండగా  హంసానందిని - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాధారణంగా టాప్ హీరోల సినిమాలలో  హీరోయిన్ లకే హీరోలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం ఇందులోని నలుగురు అమ్మాయిలకీ ప్రాధాన్యమిస్తున్నాడు. అయితే కీలకపాత్రలో కనిపిస్తున్న అనసూయకి అందరికంటే కాస్త ఎక్కువ ప్రయారిటీనే ఇస్తున్నాడా అన్నట్లుగా నాగ్ ప్రవర్తన ఉంటోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  సామాన్యంగా చిన్న పాత్రలో నటించినవాళ్ల స్టిల్స్ బయటికి రావు. అంతేకాదు సినిమా ప్రమోషన్ లోనూ పోస్టర్ లలోనూ చిన్న తారలు కనిపించరు. 

కానీ అనసూయ క్రేజ్ ఈ పద్ధతిని మార్చేసింది. ప్రస్తుతం అనసూయకు ఉన్న క్రేజ్ రీత్యా ఆమెకు ఈసినిమాలో నాగ్ చాల ప్రయారిటీ ఇస్తున్నట్టు టాక్. నాగ్ ట్విట్టర్ లో ఎప్పుడు ఈసినిమాకు సంబంధించి స్టిల్స్ విడుదల చేసినా అందులో అనసూయ ఫొటో తప్పనిసరిగా ఉంటోంది. ఆమధ్య  నాగ్ అనసూయ మాత్రమే ఉన్న స్టిల్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇటీవల విడుదల చేసినవాటిలో అనసూయతో కలిసి సెట్ లో ఉన్నప్పటి వర్కింగ్ స్టిల్స్  కూడా ఉన్నాయి. దీన్నిబట్టిచూస్తూ ఉంటే నాగార్జున అనసూయకు తెగ ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: