‘హోరాహోరి’ ఘోర పరాజయం తరువాత తేజ చేస్తున్న వ్యాఖ్యలకు ఒక అర్ధం లేకుండా పోయింది. ‘నిజం’ సినిమాను మహేష్ తో కాకుండా ఉదయ్ క్రిరణ్ తో కాని, నితిన్ తో కాని తీసి ఉంటే తన పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేదని కొద్దిరోజుల క్రితం తేజా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆ రగడ ఇంకా ముగిసి పోకుండానే తేజ జూనియర్ ను టార్గెట్ చేస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. 

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను భవిష్యత్ లో మహేష్ బాబుతో అయినా సినిమాలు చేస్తాను కాని జూనియర్ తో తాను సినిమాలు తీయనని ఘాటైన కామెంట్స్ చేసాడు. దీనికి కారణం జూనియర్ తో సినిమాలు తీయాలి అంటే ఒక పక్కా మాస్ ఫార్మెట్ లో సినిమాలు తీయాలని ఇన్ని పాటలు ఇన్ని ఫైట్స్ అని తూకం చూసుకుంటూ సినిమా చేయాలని అటువంటి మాస్ ప్రయోగాలు చేసే శక్తి తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు తేజ. 

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించమని స్వయంగా చిరంజీవి అడిగినా తాను చేయలేను అని అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు తేజా. అంతేకాదు ప్రస్తుతం తాను పరాజయాల నేపధ్యంలో ఉన్నాను కాబట్టి తనతో సినిమాలు చేయాలని జూనియర్ కాని చిరంజీవి కాని ఉత్సాహo చూపించరు అనే కామెంట్స్ కూడ చేసాడు తేజ. 

అయితే జూనియర్ తన మాస్ అపీల్ నుండి బయటకు రావడానికి సుకుమార్ తో ‘నాన్నకు ప్రేమతో’ లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటే తేజ మటుకు ఇంకా జూనియర్ ను మాస్ హీరోగానే చూస్తూ ఉండటం ఆశ్చర్యకరం. మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే రికార్డులను సృస్టించిన రాజమౌళి ‘బాహుబలి’ తేజ ఇంత వరకు చూడలేదట..


మరింత సమాచారం తెలుసుకోండి: