తెలుగు ఇండస్ట్రీలో బోయపాటి దర్శకత్వం వహించిన చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ హీరో అల్లు అర్జున్..దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సైలెంటుగా సాగిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.
పవర్ పుల్ దర్శకుడు బోయపాటి శ్రీను..అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే చాలు ఇక ప్రేక్షకుల్లో సినిమా ప్రకటించిన నాటి నుంచే అంచనాలు పెరగటం సహజం. ఈ కొత్త చిత్రానికి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించనున్నారు. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్ని కి బాగా నచ్చి మా బ్యానర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉంటూ ప్యూర్ లవ్ స్టోరి మిక్స్ అయిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బన్ని ని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలని అనుకుంటున్నారో పక్కాగా అలాంటి కేరక్టరైజేషన్ తో బోయపాటి శ్రీను కథ చెప్పటంతో అందరికి నచ్చింది.
దర్శకులు బోయపాటి శీను,అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఎనర్జిని దృష్ఠిలో పెట్టుకుని తన స్టైల్ ని కొత్తగా క్రియోట్ చేశారు బోయపాటి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటూ ‘సరైనోడు' అనే టైటిల్ ప్రచారంలోకి తెచ్చారు యూనిట్ సభ్యులు. అయితే దర్శకుడు బోయపాటి ఇదే టైటిల్ అఫీషియల్ టైటిల్ అని తేల్చేసాడట. కాకపోతే ఈ డిటేల్స్ ఇప్పుడే బయట పెట్టకుండా సంక్రాంతికి విడుదలయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.