తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసులుగా పవన్ కళ్యాన్, రాంచరణ్, అల్లు అర్జున్ రీసెంట్ గా ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ, నాగబాబు తనయుడు వరుణ్ తేజలు తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా వచ్చారు.. అయితే సాయిధరమ్ తేజ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయినప్పటికీ ఈ సినిమా కంటే ముందు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా థియేటర్లో ప్రదర్శించ బడింది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో దిల్ రాజు నిర్మాణంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా తెరకెక్కింది..ఈ సినిమా కూడా మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. మెగాస్టార్ వారసులు అనగానే డ్యాన్స్, యాక్షన్, ఫైట్స్ మీద మెగా అభిమానులు ఆశ ఉంటుంది..ఇందుకు అనుగుణంగానే సాయిధరమ్ తేజ నటన, డ్యాన్స్, ఫైట్స్ పరంగా బాగానే ఆకర్శించాడు.
ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో సాయిధరమ్ తేజకు బాగా కలిసి వచ్చింది... చిరంజీవి మెగాస్టార్ కావడానికి ముందు అప్పట్లో ఆయనను ‘సుప్రీం హీరో చిరంజీవి’ అనేవారు..ఇప్పుడు ఇదే టైటిట్ తో సాయిధరమ్ పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నందమూరి కల్యాణ్రామ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నిచ్చారు. ఈ చిత్రం సాయిధరమ్ తేజకు ఇమేజ్ కి తగ్గట్లు గా యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయట. ఇక .ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కేబ్ డ్రైవర్ గా నటిస్తుంటే...హీరోయిన్ రాశి ఖన్నా పోలీస్ పాత్రలో నటిస్తుందట. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వీరిద్దరి పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.