నిన్న విడుదలైన ‘రుద్రమదేవి’ సినిమాలోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టులు ఆశించిన స్థాయిలో లేవనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి ఈ సినిమాకు ఉన్న పరిమిత బడ్జెట్ ఒక కారణం అయితే గుణశేఖర్ గ్రాఫిక్స్ పై ఖర్చు పెట్టిన డబ్బుకు తగ్గ ఔట్ పుట్ మాత్రం రాలేదు అన్నది మరో కారణంగా చెపుతున్నారు. అంతేకాదు అవసరం లేని చోట గుణశేఖర్ అనవసరంగా గ్రాఫిక్స్ ఉపయోగించడం వల్ల పెట్టిన ఖర్చు చాలా వరకు వృథా అయింది అన్నమాటలు కూడ ఉన్నాయి. 

ఈసినిమాలో  అనుష్క మదపుటేనుగుతో  తలపడుతున్న సన్నివేశంలో అనుష్క బదులు ఓ సింహం ఏనుగుతో ఫైట్ చేస్తుంది మరి అనుష్క ఏమైంది అన్న సందేహం ప్రేక్షకులకు వచ్చే లోపూ ‘రుద్రమదేవి’ వీరత్వం చూసి ఆమె తండ్రి గణపతి దేవుడికి సింహం గుర్తుకు వచ్చిందని తన పక్కన ఉన్న ఒక పాత్రతో గణపతి దేవుడు అంటాడు. దీనితో ఈసీన్ లో ఫైట్ అంతా సింహమే చేసేస్తుంది. 

చివర్లో సింహం బదులు అనుష్కను రీప్లేస్ చేస్తారు. ఈ షాట్ చూసిన మెగా అభిమానులు మాత్రం చాల సంవత్సరాల క్రితం గుణశేఖర్ చిరంజీవితో తీసిన ‘మృగరాజు’ సీన్ గుర్తుకు వచ్చేలా గుణశేఖర్ తీసాడని సెటైర్లు వేస్తున్నారట. చిరంజీవి మరిచిపోలేని భయంకరమైన ఫ్లాప్ మూవీ మృగరాజు సీన్స్ ను గుణశేఖర్ తన ‘రుద్రమదేవి’ లో మళ్ళీ చూపెడుతూ తాను తీసిన ‘మృగరాజు’ ను మరిచి పోలేకపోతున్నాడు అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు ఇలా ఉండగా టాలీవుడ్ విశ్లేషకులు, మరో షాకింగ్ న్యూస్ ‘రుద్రమదేవి’ గురించి బయట పెడుతున్నారు. గుణశేఖర్ చెపుతున్నట్లుగా ఈసినిమా బడ్జెట్ 70 కోట్ల వరకు అయ్యే అవకాశం లేదని సుమారు 50 కోట్ల మించి ఉండదు అనే కొత్త లెక్కలు తెర పైకి తీసుకు వస్తున్నారు. ఈ వార్తలే నిజం అయితే ఈసినిమా బిజినెస్ ఇప్పటికే 50 కోట్ల వరకు అయిన నేపధ్యంలో ఈసినిమాకు ప్రస్తుతం వచ్చిన పాజిటివ్ టాక్ రీత్యా గుణశేఖర్ తన కష్టాల నుండి గట్టెక్కినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: