కువైట్‌లోని భారతీయులు ప్రయాణిస్తున్న వాహనం భారీ ప్రమాదానికి గురైంది. అయితే అదృష్ట వశాత్తు ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదు.  కువైట్‌లోని కింగ్‌ ఫహద్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాడపడ్డట్టు సమాచారం.. ఈ ప్రమాదంలో  23 మంది గాయపడ్డారు.

వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ నర్సులే.. ఫహాహీద్‌, అహ్మది ప్రాంతాల నుంచి నర్సులను ఎక్కించుకొని జహ్రా ఆసుపత్రికి వెళుతున్న ఒక వ్యాను అదాన్ ఆసుపత్రి వద్ద ప్రమాదానికి గురైంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గత కొంత కాలంగా ఈ భారతీయ నర్సులు ఫహాహీద్‌, అహ్మది ప్రాంత ఆసుపత్రుల్లో నర్సులుగా పని చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: