ఈ మద్య కాలంలో మనిషి డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనుకా ముందు ఆలోచించడం లేదు. ఈజీ మనీ కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్బున్న వారిని కిడ్నాప్ చేయడం బెదిరించి డబ్బు సంపాదించడం. డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం లాంటి చేస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి వారిటిని అరికట్టలేక పోతున్నారు. తాజాగా చిన్న పిల్లలను అక్రమ మార్గంగా అమెరికాకు రవాణా చేసి డబ్బులు సంపాదిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయ్యింది.

ఇందులో ముగ్గురు మహిళలతో సహా 16మంది ఉన్నారు. నకిలీ తల్లిదండ్రులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించి, టూరిస్టు వీసాలపై పిల్లలను అమెరికాకు ఈ ముఠా తరలిస్తోందని పోలీసులు తెలిపారు. వీరి టార్గెట్ అనాధ పిల్లలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను కొనుగోలు చేసి  బెంగళూరుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారని.. నిందితులపై దాదాపు ఏడాది పాటు సిట్ నిఘా ఉంచింది.

పిల్లలను తీసుకుని టూరిస్టు వీసాలపై వెళ్తున్న దంపతులు.. తొందరగానే తిరిగి వస్తుండటం, వచ్చేప్పుడు పిల్లలు లేకుండానే రావటం గమనించిన దర్యాప్తు అధికారులు సోమవారం 14 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ముఠా నాయకుడితో సహా 16మందిని అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: