ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అందరికీ సుపరిచితమే. తాగాజా తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆయన ద్వితీయ కుమార్తే శ్వేత చౌదరికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ ఏమిటా గౌరవం అంటారా..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌  తన ప్రచార కార్యక్రమ బాధ్యతలు నిర్వర్తించే కీలక బృందంలో సభ్యురాలిగా శ్వేతచౌదరి ఎంపిక చేసుకున్నారు.  ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్ర‌చారం హోరాహోరీగా సాగుతోంది.
 
శ్వేత చౌదరి కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కేశినేని నాని తరపున ఆమె విజయవాడ పార్లమెంట్‌ పరధిలో ప్రచారం నిర్వహించారు.  ఈ నేపథ్యంలో  ఎన్నిక‌ల్లో హిల్లరి క్లింటన్‌ తరపున విజయవాడ అమ్మాయి ప్రచారం చేస్తోందన్న విషయం తెలుసుకొని చాలా మంది ఆనందపడుతున్నారు. ఎంపీ కుమార్తె తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని బాగానే అందిపుచ్చుకుంటోంది అని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: