గత కొంత కాలంగా అమెరికా అధ్యక్ష పదవి కోసం వీరలెవెల్లో ప్రచారం చేస్తున్న రోనాల్డ్ ట్రంప్ ఆ మద్య భారతీయులపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.  మొన్నటికి మొన్న ఇస్లాం మతంపై విరుచుకుపడ్డారు. మొదటి నుంచి డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే సగం ఫేమస్ అయ్యారు. తాజాగా భారతీయులకు  అనుకూలంగా వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అమెరికా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించాల్సిన అవసరం లేదని అన్నారు.

ఎందుకంటే భారతీయ విద్యార్థులు చాలా తెలివైన పిల్లలని అలాంటి వారి విజ్ఞానం ప్రపంచానికి ఎంతో అవసరం అని అన్నారు. అంతే కాదు వారు ఫీజులు కట్టి చదువుకుంటున్నారు.. వారిలో చాలామంది తెలివైనవారు ఉన్నారు.. మనకు అలాంటి వారే కావాలి అని వ్యాఖ్యానించారు. మరో ట్విస్ట్ ఏంటంటే..ఇండియన్స్ అయితే తిరిగి ఇండియాకు వెళ్లి కంపెనీలు పెట్టుకొని ఉద్యోగాలు సృష్టించాలి' ట్రంప్ మరో సలహా కూడా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: