భారత్ నుంచి చాలా మంది వరకు ఉన్నత విద్య అభ్యసించడానికి, బతుకు దేరువు కోసం విదేశాలకు వెళుతుంటారు. అయితే అక్కడ అన్నీ సజావుగా సాగితే..తిరిగి ఇండియాకు వచ్చి మంచి జీవితం గడుపుతారు..కానీ కొన్ని సార్లు విదేశాల్లో ప్రమాద వశాత్తు..కొంత మంది దుండగుల దాడిలో చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి.  మీరాలం మండిలో నివసించే మీర్ బాఖీర్ అలీ రిజ్వీ లండన్ లో అనుమానాస్పదపు మృతి చెందారు. వివరాల ప్రకారం మీరాలం మండి చెందిన మీర్ బాఖీర్ అలీ రిజ్వీ లండన్ లో నివసిస్తున్నాడు.

అయితే గత సంవత్సరం కొంత మంది బాఖీర్ పై దాడి చేసి గాయపర్చారు. అయితే ఈ మద్య బాఖీర్ హైదరాబాద్ వచ్చి తిరిగి లండన్ వెళ్లారు. అయితే గతంలో తనపై దాడిచేసిన వారిపై కేసు పెట్టాడు. అయితే ఈ కేసు కోర్టులో విచారణ జరిపి బాఖీర్ కు భారీ నష్టపరిహారం చెల్లించాలని నిందితులను ఆదేశించినట్టు సమాచారం. ఈ నెల 12 న బాఖీర్ రైల్వే పట్టాలపై మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

మీర్ బాఖీర్ అలీ రిజ్వీ ఈ నెల 12న మృతి చెందినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. అయితే గతంలో తమ కుమారుడిపై దాడి జరిపిన వారే అతన్ని హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: