భారత దేశంలో ఎంతో మంది ఉన్నత విద్యనభ్యసించడానికి ఎంతో మంది విదేశాలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అక్కడ అనుకోని ప్రమాదాలకు గురికావడం..చనిపోవడం జరుగుతుంది. దీంతో ఇంట్లో వారికి గర్భశోకాన్ని మిగిల్చిన వారు చాలా మంది ఉన్నారు. అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధిని ప్రియాంక గోగినేని ప్రమాదవశాత్తు మరణించింది.నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని చేవూరివారితోటలోని గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుల కుమార్తె ప్రియాంక చౌదరి(25). లాస్వేగాస్లోని స్థానిక హిక్ లేక్లో ఈతకు వెళ్లింది. అయితే అక్కడే ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ప్రియాంక. అనంతరం అమెరికాలోని వాషింగ్టన్లో ఎంఎస్ చదివింది. నెలరోజుల క్రితం లాస్వేగాస్లోని ఓ సంస్థలో సివిల్ ఇంజినీర్గా చేరింది. అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన ప్రియాంక ఇలా ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలుసుకున్న అక్కడ ఆమె స్నేహితురాలు మణి పోతేపల్లి నాట్స్ హెల్ప్ లైన్కు ఫోన్ చేశారు.
దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రియాంక మృతదేహాన్ని ఇండియాలోని ఆమె తల్లిదండ్రులకు పంపించేందుకు సహకరించాలని కోరారు. దాంతో నాట్స్ సంస్థ ప్రియాంక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు రంగంలోకి దిగింది. దీని కోసం స్థానిక పోలీసు అధికారులతో చర్చలు జరుపుతోంది.