అమెరికాలోని కెంటకీ రాష్ట్రం , లూయివిల్ నగరంలో తెలుగు సంఘం (టాక్) ఆధ్వర్యంలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. జయ నంబూరి బృందం ఆలపించిన విఘ్నేశ్వర ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. సంస్థ అధ్యక్షుడు ప్రతాప్ చిలుకూరి ఆహూతులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లత ఉమ్మాజి, రఘు కొడుమూరి, సత్య నోరి, సరస్వతి వడ్లమాని కార్యక్రమానికి వ్యాఖ్యానం అందించారు. అనిల్ రెడ్డి, శ్రీనివాస్ వేమూరి, లత ఉమ్మాజి సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించారు.