దుబాయ్లోని తెలుగు వారందరికీ సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చేసింది. వేవ్ రెసోనెన్సు ఈవెంట్స్ సంస్థ ఇక్కడి తెలుగు వారందరికోసం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు జరపటం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా షార్జాలో మరుబెల్లా రిసార్ట్లో ఈ వేడుకలని ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తెలుగు వారంతా ఈ వేడుకకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలంతా సంప్రదాయ వస్త్రాధారణతో ఇండియాలో జరుపుకునే పద్ధతులకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 


 
గృహిణులకు ముగ్గుల పోటీలు, పిల్లలకి డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. మగవారంతా ఫ్యాషన్ వాక్, డాన్సులతో అదరగొట్టారు. ఇటీవల ప్రవాసీ మిత్ర అవార్డు అందుకున్న శ్రీ తులసి ​ప్రసాద్, మాగల్ఫ్.కామ్ నిర్వాహకులు శ్రీకాంత్ని తెలుగు వారంతా అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న వారి పేర్లను లక్కీ డిప్ తీయగా ఇండియాకి తిరుగు ప్రయాణ టికెట్ను షార్జాకి చెందిన ప్రియా శ్రీరామ్ గెలుచుకున్నారు. ఉదయం 10. 30 నిమిషాలకి ప్రారంభమైన వేడుకలు సాయంత్రం 6 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: