తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 'బ్లడ్ డ్రైవ్- లైఫ్ సేవింగ్' నినాదంతో టీపీఏడీ మూడో ఏడాది రక్తదాన శిబిరాన్ని డల్లాస్లోని ఫ్రిస్కోలో ఏర్పాటు చేసింది. కార్టల్ బ్లడ్ కేర్, వైబ్రంట్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ కమ్యూనిటీలతో కలిసి టీపీఏడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి రిజిస్టర్ చేసుకున్నా, పరిధిదాటడంతో 100 మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించారు.



సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతో టీపీఏడీ ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టింది. 2016లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తంతో 78 మంది ప్రాణాలు కాపాడగలిగింది.టీపీఏడీ ప్రెసిడెంట్ కరన్ పోరెడ్డి, సెక్రటరీ రమణ లష్కర్, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, రవికాంత్ మామిడిలతోపాటూ పలువురు టీపీఏడీ సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు. ఈ ఏడాదిలో మే 13న వనభోజనాలు, జూలై 8న ఫుడ్ డ్రైవ్, సెప్టెంబర్ 23న బతుకమ్మ, దసరా సంబరాలు, నవంబర్11న షామ్-ఈ-మెహ్ఫిల్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి టీపీఏడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: