అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలిచే తెలుగు సంఘం నాట్స్‌ ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానాలు అందించేందుకు ప్రతినిధులు మాతృభూమికి విచ్చేశారు. సేవే గమ్యం అంటూ నాట్స్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించడంతో పాటు పలువురు ప్రముఖులను నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానించింది.


ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లను నాట్స్‌ అధ్యక్షుడు మోహన్‌కృష్ణ మన్నవ, కమిటీ సమన్వయకర్త రవి ఆచంట, పలువురు నాట్స్‌ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న కృషిని లోకేశ్‌ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: