అమెరికాలోని డల్లాస్‌లోని అతిపెద్ద మహాత్మాగాంధీ మెమోరియల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. అక్కడ ఉన్న మహాత్ముడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహాత్ముడి మెమోరియల్‌ నిర్మాణానికి కృషి చేసిన ఎంజీఎంఎన్‌టీ ఛైర్మన్‌ డా.ప్రసాద్‌ తోటకూర, ఆయన బృందం రావు కల్వాల, ఎంవీఎల్‌ ప్రసాద్‌, పీయూష్‌ పటేల్‌, జాన్‌ హమ్మోన్డ్‌, షభ్నం మోడ్గిల్‌, తైయాబ్కుంద్వాలా, జాక్‌ గోధ్వాని, సల్మాన్‌ ఫర్షోరి, కమల్‌ కౌశల్‌ను అభినందించారు.



ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా మహాత్ముడి మెమోరియల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరిటాల ప్రభాకర్‌, ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో రవి వేమూరు ఇతర ప్రభుత్వ అధికారులకు డా.ప్రసాద్‌ తోటకూర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నవ్యాంద్రప్రదేశ్‌ నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం, వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగువారితో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలన్న అంశంపై కొన్ని సూచనలు ఉన్న ఓ లేఖను ప్రసాద్‌ తోటకూర సీఎం చంద్రబాబుకు అందజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: